Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోసానిని ముందుగా మాకు అప్పగించండి: వాహనంతో జైలు ముందు నరసరావు పేట పోలీసులు

Advertiesment
Posani

ఠాగూర్

, సోమవారం, 3 మార్చి 2025 (13:09 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నమోదైన కేసులో పోసాని అరెస్టయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే పోసానీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులో నమోదయ్యాయి. ఆయన అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా నరసరావు పేట, అల్లూరు జిల్లా, అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. అయితే, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నరసరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలనే దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాసలోచనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతధికారుల అనుమతితో నరసరావు పేట పోలీసులకు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తయ్యా మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది: అత్తకు అల్లుడు ఫోన్, కానీ...