Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనిఖీల్లో 57 కేజీల వెండి, తుపాకి స్వాధీనం... పోలీసులు షాక్..ఎక్కడ?

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:40 IST)
ఎపి సరిహద్దుల్లో ఎస్‌ఇబి, పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే వెండి బయటపడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. గంజాయి, అక్రమ మద్యం, హవాలా డబ్బు, బంగారం వంటి అక్రమాలకు చెక్‌ పెడుతూ పోలీసులు ఇటీవల తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా డబ్బు, బంగారం, అక్రమ మద్యం పట్టుబడుతోంది.

తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ సోదాలు మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న వెండిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వడమాలపేట మండలం ఎస్‌వి.పురం టోల్‌ ప్లాజా దగ్గర పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.

తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం తమిళనాడుకు చెందిన కారులో సోదాలు చేపట్టగా.. అందులో 57 కేజీల వెండి ఆభరణాలతో పాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. ఆభరణాల విలువ రూ.41,99,164 ఉంటుందని అంచనా వేస్తున్నారు. కారుతో సహా 57 కిలోల వెండిని, తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ వెండి ఆభరణాలను చెన్నైలోని లలితా జ్యువెలరీ నుంచి తిరుపతిలోని లలితా జ్యువెలరీకి తీసుకువస్తున్నట్లు కారు డ్రైవర్‌ డాక్యుమెంట్లను పోలీసులకు చూపించారు. అయితే, రసీదులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోడానికి పోలీసులు పుత్తూరు కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయానికి పంపారు. కారులో ఉన్న తుపాకీకి లైసెన్స్‌ ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు ఉండటంతో సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments