Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి అత్యాచార నిందితుడి ఆచూకీ తెలపండి...

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటన నిందితుడు ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ పోలీసులు ఫేస్‌బుక్ ద్వారా కోరారు. రెండు ఫొటోలు, వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొన్ని నెలల క్రితం యవతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ ఎ-2 నిందితుడిగా ఉన్నాడు. ఎ-1 కృష్ణతోపాటు అతడి వద్ద సెల్‌ఫోన్లు తాకట్టు పెట్టుకున్న మరో వ్యక్తిని ఎ-3గా చూపించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఎ-2 ప్రసన్నరెడ్డి మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.  దీంతో నిన్న అతడి వివరాలను ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన పోలీసులు కనిపిస్తే చెప్పాలని కోరారు.
 
‘‘వెంకట్‌ది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కుక్కలవారిపాలెం. పూర్తిపేరు రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్. వయసు 22 సంవత్సరాలు. కుడిచేతిపై పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉంటుంది. రైళ్లలో యాచిస్తూ సమోసాలు విక్రయించే వారితో తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్లడం, తాపీపని వంటి పనులు కూడా చేస్తుంటాడు. అత్యాచార ఘటన తర్వాత అండర్‌పాస్‌ల వద్ద, పాడుబడిన భవనాల్లోను, రైలు పట్టాల పక్కన, అన్నదానాలు చేసే ఆలయాల పక్కన ఆశ్రయం తీసుకుంటున్నాడు. నిందితుడిని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వండి’’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నోట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments