తిరస్కరించిందనీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు...

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:56 IST)
తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ మహిళా పోలీసు అధికారిణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో కిరాతకుడు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, వల్లికున్నం పోలీస్ స్టేషన్‌లో సౌమ్య పుష్కరణ్ (31) అనే మహిళ పోలీసు అధికారిణిగా పని చేస్తోంది. 
 
ఈమె శనివారం తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అజాస్ కారులో వచ్చి ఆమె ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత లేచి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, కారుతో వెంబడించి, ఆ తర్వాత గొడ్డలితో నరికి, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తూ కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అజాద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు వద్ద జరిపిన విచారణలో... తమ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగిందనీ, అయితే, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, ఆమె అంగీకరించలేదని చెప్పారు. ఆ కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments