Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పరీక్షలని కుమ్మేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:49 IST)
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలీసుల అత్యుత్సాహం చూపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడిని కరోనా పరీక్షల పేరుతో అదుపులోకి తీసుకుని ఆ యువకుడిని చిత్రహింసలు గురిచేశారని ఆ యువకుని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
 
దొరవారిసత్రం మండలం బురద గళ్లు గ్రామానికి చెందిన కండ్రిక వినోద్ అనే యువకుడు బెంగళూరు నుంచి రావడంతో గ్రామ వాలంటీరుకు సమాచారం ఇచ్చి అనంతరం వాళ్ల సలహా మేరకు దొరవారి సత్రం పోలీస్ స్టేషనుకి తీసుకెళ్లగా ఆ యువకునితో పాటు తల్లితండ్రులను సోదరుడిని అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం అక్కడే ఉంచి ఎంతకు వారిని పరీక్షలు చేయకపోవడంతో ఉదయం 10 గంటల నుండి వేచి ఉన్నా సరిగా పట్టించుకోలేదని పోలీసులను అడగడంతో పోలీసులకు చిర్రెత్తింది.
 
పోలీసుల లాఠీకి పని చెప్పారనీ, ఎంత అరిచి మొత్తుకున్నా వాళ్లని చిత్రహింసలకు గురిచేశారనీ, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ముట్టడించి వారిని విడిచి పెట్టాలని లేకుంటే పురుగు మందులు తాగి అక్కడే చస్తామని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
 
దొరవారిసత్రం ఎస్సై సుధాకర్రెడ్డి మహిళలను కూడా దుర్భాషలాడారని గతంలో ఇసుక తరలింపు విషయంలో గ్రామస్తులకి ఎస్సైకి మధ్య పాతకక్షలు ఉన్నాయని అదను కోసం ఎస్సై ఎదురుచూసి అవకాశం దొరికిందని యువకుడిని చిత్రహింసలకు చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments