Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... సెల్ఫీ ఇవ్వలేదని కోడిగుడ్లతో దాడిచేశారట...

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై కొందరు దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. లోకేశ్ పాదయాత్రలో నడిచి వెళుతుండగా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కోడిగుడ్ల దాడి జరిగింది. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలి పగిలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని పెన్నా నగర్‌కు చెందిన బాలు, శ్రీకాంత్ అనే వారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దాడి ఘటనపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాలు, శ్రీకాంత్‌ కోడిగుడ్లు విసిరానని చెప్పారు. నిందితులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. నారా లోకేశ్ తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లతో దాడిచేశారని, వీరిద్దరూ మాట్లాడుకునే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments