Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... సెల్ఫీ ఇవ్వలేదని కోడిగుడ్లతో దాడిచేశారట...

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై కొందరు దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. లోకేశ్ పాదయాత్రలో నడిచి వెళుతుండగా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కోడిగుడ్ల దాడి జరిగింది. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలి పగిలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని పెన్నా నగర్‌కు చెందిన బాలు, శ్రీకాంత్ అనే వారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దాడి ఘటనపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాలు, శ్రీకాంత్‌ కోడిగుడ్లు విసిరానని చెప్పారు. నిందితులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. నారా లోకేశ్ తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లతో దాడిచేశారని, వీరిద్దరూ మాట్లాడుకునే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments