Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు అల్లూరి సంబంధీకులతో ప్రధాని మోడీ సమావేశం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో సమావేశంకానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్ళు ఇలా మొత్తం 37 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిందరినీ ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
నిజానికి వీరిందరినీ ప్రధాని మోడీ ఆశీనులయ్యే సభా వేదికపైనే కూర్చోబెట్టాలని తొలుత భావించారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత  వీరందరితో ఒక సమావేశమందిరంలో భేటీ అవుతారు. 
 
మరోవైపు, ఈ సందర్భంగా జరిగే కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే.రోజా, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు తదితరులు వేదికను అలంకరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తులో స్థాపించిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments