Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు అల్లూరి సంబంధీకులతో ప్రధాని మోడీ సమావేశం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బంధువులు, సంబంధీకులతో సమావేశంకానున్నారు. ఈ మేరకు అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, అల్లూరి సైన్యంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్ళు ఇలా మొత్తం 37 మంది అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిందరినీ ప్రధాని మోడీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమవుతారు. 
 
నిజానికి వీరిందరినీ ప్రధాని మోడీ ఆశీనులయ్యే సభా వేదికపైనే కూర్చోబెట్టాలని తొలుత భావించారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత  వీరందరితో ఒక సమావేశమందిరంలో భేటీ అవుతారు. 
 
మరోవైపు, ఈ సందర్భంగా జరిగే కార్యక్రమ వేదికపై ప్రధాని మోడీ, గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి ఆర్కే.రోజా, టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిట్టింగ్ ఎంపీ రఘురామరాజు తదితరులు వేదికను అలంకరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల ఎత్తులో స్థాపించిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments