Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కరోనా టెన్షన్: ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు పాజిటివ్

Advertiesment
corona
, శనివారం, 2 జులై 2022 (14:15 IST)
ఏపీలో కరోనా టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఫోర్త్‌ వేవ్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నా.. భారీ సంఖ్యలోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు కరోనా టెన్షన్‌ పెడుతోంది. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారినపడ్డారు.. గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తాజాగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా.. ఇక, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి కూడా కోవిడ్‌ సోకింది.
 
ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు.. ఈ మధ్య తమను కలిసినవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా మహమ్మారి బారినపడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మేకతోటి సుచరిత, ఆర్కే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంజనీర్‌‌‌‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం