Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో అధికారులు జులుం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:39 IST)
పిఠాపురం మున్సిపల్ అధికారులే స్వయంగా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పన్ను కట్టలేదని తమ జులుం ప్రదర్శించారు. ఇంట్లో మహిళలు ఉండగానే ఇంటికి తాళం వేశారు. ఆ తర్వాత మహిళలు గొడవకు దిగడంతో సిబ్బంది వచ్చి ఇంటి తాళం తీశారు. మునిసిపల్ అధికారులు వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, అదికూడా తమ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 
 
పిఠాపురం పట్టణంలోని మోహన్ నగరులో ఇంటి పన్ను వసూళ్లకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణల ఇంటికి తాళం వేశారు. పన్ను చెల్లించని కారణంగా వారిళ్ళకు తాళం వేసి నోటీసులు అంటించారు. ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. సత్తిబాబు ఇంట్లోని మహిళలు ఆందోళనకు దిగడంతో తాళాలు తొలగించారు. సత్తిబాబు ఇంటికి వేసిన సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు. 
 
దీనిపై సత్తిబాబు మాట్లాడుతూ, సాధారణంగా తనకు ఎపుడూ రూ.1600 మాత్రమే ఇంటి పన్ను వచ్చేదన్నారు. కానీ ఈ దఫా రూ.6400 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేందుకు తనకు గడువు ఇవ్వాలని కోరినా వారు ఏమాత్రం వినిపించుకోలేదని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments