Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బంద్‌కు మద్దతు.. బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీ: పేర్ని నాని

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (23:08 IST)
భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన జరిగే ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న బంద్‌కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతోన్న బంద్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంటును మేం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందన్నారు.
 
ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయని, గత ప్రభుత్వంలో ఇసుక పంచాయతీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సర్దుబాటు చేసేవారని విమర్శలు వచ్చాయని అన్నారు. ఇసుక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా రూ. 765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తోందని, గత ఐదేళ్ల కాలంలో ఈ మొత్తం ఎక్కడికి పోయింది..? అని పేర్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments