Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం జరిగినా నా మీద పడి ఏడవడానికి రెడీగా వుంటారు.. పవన్

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:58 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడిని ఖండించినందుకు తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు. ఏదో సామెత చెప్పినట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, ఆయన వర్గం తమ మీద పడి ఏడవడానికి రెడీగా ఉంటారని పవన్ మండిపడ్డారు.
 
కాగా జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై పవన్ స్పందించారు. దాడిని ఖండించిన పవన్ ఈ చర్య అమానుషమని తెలిపారు.  గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్, కేసీఆర్, కేటీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులపై విరుచుకుపడ్డారు. 
 
తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలమైతే ఒక్క మాటా మాట్లాడని వీరంతా జగన్‌కు చిన్న గాయం తగలగానే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర కోణం కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. "ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు'' ఏం జరిగినా.. మా మీద పడి ఏడుస్తారెందుకు అని ప్రశ్నించారు.
 
మరోవైపు జగన్‌కు చికిత్స అందిస్తున్న హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు... ఆయనకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు గాయమైందని ప్రకటించారు. తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments