Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కాపురం రైల్వే స్టేషన్‍‌లో నరకయాతన అనుభవించిన ప్రయాణికులు...

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (10:46 IST)
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషనులో కొందరు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ స్టేషనులోని లిఫ్టులో పలువురు ప్రయాణికులు చిక్కుకునిపోయారు. ఫ్లాట్‌ఫామ్ మారేందుకు 14 మంది ప్రయాణికులు స్టేషన్‌లోని లిఫ్టు ఎక్కారు. అయితే, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో  ఈ లిఫ్టు ఆగిపోయి తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు లిఫ్టులోనే మూడు గంటల పాటు నానా అవస్థలు పడ్డారు. 
 
లిఫ్టులో చిక్కున్నవారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు రాగా.. ఈ ఘటన చోటుచేసుకుంది.
 
కాగా, ఈ మధ్యకాలంలో అనేక రైల్వే స్టేషన్‌లలో లిఫ్టు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ లిఫ్టు సౌకర్యం ప్రారంభించిన కొద్ది రోజుల వరకు బాగానే పనిచేసినప్పటికీ ఆ తర్వాత లిఫ్టుకు సర్వీసు చేయకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడ వంటి చర్యల కారణంగా ఇవి మొరాయిస్తూ, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments