Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం క్యూలో పడిగాపులు.. నో అడ్మిషన్ బోర్డ్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (19:41 IST)
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు ప్రైవేటు పాఠశాలలోనే చదివించాలని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ నిరుపేదలు మాత్రం వేరే మార్గం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తుంటారు. ప్రతి యేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. 
 
కానీ అందుకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కొత్ల ఇండ్లులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పరిమితికి మించి చేరారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత సంవత్సరం 850 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించగా ఈ యేడాది ఏకంగా 1022 మంది చేరారు. 
 
చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం విద్యార్థులు వస్తూనే ఉండటంతో అడ్మిషన్లు ఆపేశారు. సీట్లు లేవంటూ పాఠశాల ముందు బ్యానర్ కూడా కట్టేశారు. పాఠశాలలో క్రమశిక్షణతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా నడుపుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడుపుతుండటంతో  తల్లిదండ్రులు ఈ పాఠశాలలలోనే తమ పిల్లలను చేర్పించేందుకు పోటీలు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments