Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:23 IST)
ఇటీవల వైకాపాలో చేరిన సినీ నటుడు మోహన్ బాబుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మోహన్ బాబు విమర్శలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. మోహన్ బాబు ఇపుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారన్నారు. 
 
పాతికేళ్ల కిత్రం నిమ్స్‌ ఆస్పత్రి సిబ్బందితో మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మరిచిపోయినట్టుగా ఉన్నారన్నారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల తన విద్యా సంస్థల్లో పని చేస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నడిరోడ్డుపై పడుకుని ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments