Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై హత్యాచారం.. అత్యాచారానికి పాల్పడి.. నోట్లో బియ్యం పోశారు..

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (14:41 IST)
నిర్భయ, దిశ చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గట్లేదు. వయోబేధాలు లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు నోట్లో బియ్యం కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవరాజుకుంట శివారులో దారుణం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి అనంతరం నోట్లో బియ్యం గింజలు పోసి హత్యాయత్నం చేశారు. ఆమె చనిపోయిందనుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళ స్పృహలోకి వస్తే మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందనుకున్నారు పోలీసులు. కానీ బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ కేసును చేధించడం మిస్టరీగా మారింది. ఈ సంఘటనలో ప్రాధమిక ఆధారాలను గుర్తించిన పోలీసులు మహిళపై అత్యాచారంచేసి అనంతరం హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు.  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు ఒంగోలు శ్రీనగర్ కాలనీకి చెందిన పోలమ్మగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments