Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒమైక్రాన్‌ కలకలం... ఐర్లాండ్‌ నుంచి శృంగవరపుకోటకు!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:26 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ రాష్ట్రంలోనూ కలకలం రేపింది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. 
 
 
జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడ పరీక్షలు చేయించుకోకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఎస్‌.కోట మండలంలోని అత్తవారింటికి వచ్చాడు.  ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వడంతో మూడు రోజుల కిందట వైద్య సిబ్బంది వచ్చి ఆ వ్యక్తితోపాటు, ఆయన భార్య, అత్త నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్షించగా, ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు  రిపోర్టు వచ్చింది. 
 
 
ఒమైక్రాన్ అనే అనుమానంతో శాంపిల్స్‌ను హైదరాబాద్‌ పంపించారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. హోం క్వారెంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించినా.. ఆయన పట్టించుకోకుండా.. వేపాడ మండలంలోని సొంతింటికి వెళ్లాడు. అక్కడ నుంచి విశాఖపట్నం మధురువాడ వెళినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments