కోర్టు ధిక్కరణ కేసులో డీఈవోకు కోర్టు తలంటు - సామాజిక సేవ చేయాలంటూ...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:07 IST)
కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిని హైకోర్టు చీవాట్లు పెట్టింది. పలుమార్లు కోర్టు కోర్టు చేసిన హెచ్చరికలను డీఈవో కె.శ్యామ్యూల్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంపై గత 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తక్షణం ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదైంది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు... న్యాయస్థానం అమలులో ఒక యేడాది పాటు జాప్యం కావడానికి డీఈవోనే ప్రధాన కారణమని తేల్చింది. 
 
దీంతో కోర్టుకు ఆయన సారీ చెప్పారు. అయితే, క్షమాపణలు అంగీకరించాలంటే వారం రోజుల పాటు జిల్లాలోని ఏదేని వృద్ధాశ్రమంలోకానీ, అనాథాశ్రమంలోగానీ సామాజికసేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు డీఈవో అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments