Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ కుటుంబానికి ప్రభుత్వ పరిహారం.. బాబు కోటి డిమాండ్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:48 IST)
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిత్తూరుకు చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన డెడ్ బాడీని అధికారులు గుర్తించ లేదు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాసారు. భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్‌ నాయక్‌ సాయితేజకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. 
 
హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో సాయి తేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సరిహద్దులో ఉగ్రవాదులతో పోరాడటంలో చేసిన శౌర్యం చాలా ప్రశంసనీయమని, మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments