Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌రావ‌తి రైతుల‌కు తిరుపతిలో బహిరంగ సభకు నిరాక‌రణ‌; మ‌ళ్ళీ కోర్టుకు!

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (09:34 IST)
అమరావతి రాజ‌ధాని కోసం రైతులు చేప‌ట్టిన మ‌హా పాద యాత్ర తిరుపతికి చేరుతోంది. ఈ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి మేర్లపాక వరకు కొనసాగనుంది. మధ్యలో ఇసుకగుంట వద్ద భోజన విరామానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీకి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా అదే రోజున తిరుపతిలో పాదయాత్ర ముగించి బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. తొలుత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా, కోర్టుకు వెళ్లటంతో కొన్ని షరతులతో కోర్టు వారి పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.
 
 
ఇప్పుడు పాదయాత్ర ముగింపులో భాగంగా 17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు లేఖ పంపారు. హైకోర్టు కేవలం పాదయాత్ర నిర్వహణకు మాత్రమే అనుమతించిందని, కొవిడ్‌ నిబంధనల మేరకు బహిరంగ సభకు అంగీకరించలేదని అందులో స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమయ్యే ఆస్కారమున్నందున బహిరంగ సభకు అనుమతివ్వడం లేదని వెల్లడించారు. దీనితో అమ‌రావ‌తి రైతులు మ‌ళ్ళీ కోర్టుకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments