Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ రైతుల ధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పిన మంత్రి

తెలంగాణ రైతుల ధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పిన మంత్రి
, సోమవారం, 6 డిశెంబరు 2021 (15:10 IST)
తెలంగాణా రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి గట్టి హెచ్చరికలాంట వార్త చెప్పారు. రైతులు వరి వంటను వేయడానికి వీల్లేదని చెప్పారు. పనిలోపనిగా ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా యాసంగిలో రైతులు ఎట్టిపరిస్థితుల్లోను ధాన్యం పంటను వేయొద్దని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ, యాసంగిలో వేసే వరి పంటను కొనుగోలు చేసే ప్రసక్తే ఉండదని, అందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవన్నారు. ఒకవేళ ప్రభుత్వ హెచ్చరికలను కాదని రైతులు వరి పంట వేస్తే చిక్కుల్లో పడతారని చెప్పారు. అదేసమయంలో రైతులు ప్రత్యామ్నాయ సాగుపై ఆలోచనలు చేయాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. ఈవో అనిల్ కుమార్