Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త

నిద్రపోతున్న భార్య గొంతుకోసి.. తలను ఠాణాకు తీసుకెళ్లిన కసాయి భర్త
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:58 IST)
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో దారుణం జరిగింది. నిద్రపోతున్న భార్యను కట్టుకున్న భర్త అతికిరాతకంగా గొంతుకోశాడు. తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఇమాద్ నగర్‌కు చెందిన సమ్రీన్ బేగం అనే అమ్మయిని ఫర్వేజ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు. అయితే భర్త వేధింపులు భరించలేని ఆమె విడాకులు తీసుకుంది. 
 
ఆ తర్వాత పెద్దల సమక్షంలో మళ్లీ రాజీకొచ్చిన ఫర్వేజ్.. సమ్రీన్‌ను మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. పైగా సమ్రీన్‌పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన ఫర్వేజ్... తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భార్య సమ్రీన్ గాఢ నిద్రలో ఉండగా ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత తలను చేతపట్టుకుని నేరుగా స్టేషన్‌కు తీసుకెళ్లాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఫర్వేజ్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలికి వచ్చిన సమ్రీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమ్రీన్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం