Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలోనే 41 రోజులు గడిపిన ఆ కుటుంబం.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (10:16 IST)
ఆధునికత, సాంకేతికత ఎంత పెరిగినా.. మూఢనమ్మకాలపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గట్లేదు. దేశంలో నరబలులు అధికమవుతున్నాయి. తాజాగా చనిపోయిన వ్యక్తిని బతికించేందుకు 41 రోజుల పాటు శ్మశానంలోనే ఓ కుటుంబం గడిపింది. శ్మశానాన్ని ఖాళీ చేయమన్నందుకు గ్రామస్థులపై వారు దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ తుపాకుల శ్రీనివాస్ 40 రోజుల క్రితం డెంగీతో మృతి చెందాడు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే, శ్రీనివాస్ మరణించడానికి ముందు రైల్వేకోడూరులో ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ వ్యక్తి చేతబడి చేయడంతో శ్రీనివాస్ మరణించాడని కుటుంబీకులు అనుకున్నారు. 
 
మరణించిన శ్రీనివాస్‌ను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులంతాక్షుద్రపూజలు చేసే ఓ తాంత్రికుడిని సంప్రదించారు. అతను కూడా శ్రీనివాస్‌ను బతికిస్తామని హామీ ఇచ్చాడు. ఇందుకోసం శ్మశానంలో 41 రోజులు పూజలు చేశాడు. ఇందుకోసం రూ.8లక్షలు ఖర్చు చేయాలన్నాడు. శ్రీనివాస్ కుటుంబం కూడా శ్మశానంలోనే 41 రోజుల పాటు మకాం వేసింది. 
 
విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరితే వారిపైనే తిరగబడ్డారు. కత్తులతో బెదిరించారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. శ్రీనివాస్ కుటుంబీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments