Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో అల్లాడుతుంటే బార్లు అవసరమా? : సీపీఐ

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:21 IST)
ఏపీలో ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే ప్రభుత్వం బార్లు తెరవడం అవసరమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికే వైన్ షాపులకు అనుమతి ఇవ్వడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయి దేశంలో ఏపీ 2వ స్థానానికి చేరిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించిందన్నారు.  పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపిందని మండిపడ్డారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని రామకృష్ణ తెలిపారు. ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments