Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?
, గురువారం, 27 ఆగస్టు 2020 (18:55 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పైన‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల‌ని కోరారు.

ఏపీలో కరోనా వైరస్ జైళ్లకు కూడా వ్యాపించ‌డంతో పాటు పలు జైళ్లలో ఖైదీలకు, సిబ్బందికి కరోనా సోకింద‌న్నారు. ఒక్క కడప జైల్లోనే 395 మందికి ఖైదీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

న్యాయ పరిధికి లోబడి ఖైదీలను విడుదల చేయాలని ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినప్పటికీ స్పందన లేద‌ని తెలిపారు.

ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఈ నేప‌ధ్యంలో త‌న లేఖ‌పై ఆలోచ‌న చేయాల‌ని రామకృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బు.. త్వరలోనే అమలు