Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో జ్యోతుల నెహ్రూ : వైకాపా ఎంపీ వీడియో కాల్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (15:27 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పలువురు నేతలు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ నేతలు కూడా ఉన్నారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెహ్రూను మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డిలు పరామర్శించారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. 
 
ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చాలా మంది టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి నెహ్రూను పరామర్శించారు. అయితే.. ఆయన వద్దకు వైఎస్సార్ సీపీ నేతలు చర్చనీయంగా మారింది. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిపై అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments