Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తల్లి గీతాలాపన రద్దు? వైకాపా పాటలు పెట్టేశారా? నారా లోకేశ్

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (18:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో తెలుగు తల్లి గీతాలాపన రద్దు చేసి వైకాపా పాటలు పెట్టేశారా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏపీ విద్యా మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో తెలుగు తల్లి గీతాలాపన చేయకుండా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ విద్యార్థులతో అధికారులు ఆలపించారు. డ్యాన్సులు వేయించారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ అంశంపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ‌గా మార్చేసారా? లేకపోతే ప్ర‌భుత్వ గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో ఏంటీ సిగ్గుమాలిన ప‌నులు? అమ్మఒడి ఇస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుని వైకాపా బ‌డులు చేస్తున్నారా? 
 
వైకాపా జెండా ఎత్త‌మంటూ ముక్కుప‌చ్చ‌లార‌ని పిల్ల‌ల‌తో ఆడించారు. రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ మ‌న జ‌గ‌న‌న్న అంటూ విద్యార్థుల‌తో పాడించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాల‌యాన్ని విష‌ప్ర‌చార నిల‌యం చేశారు.
 
మొన్న భామిని త‌హ‌సీల్దార్ తాగి మ‌న జ‌గ‌న‌న్న అంటూ గెంతులేశాడు. నిన్న‌ వంద‌లాది గిరిజ‌న విద్యార్థుల‌తో వైకాపా పార్టీ ప్ర‌చార‌గీతాల‌కు స్టెప్పులేయించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో తెలుగుత‌ల్లి గీతాలాప‌న ర‌ద్దు చేసి వైకాపా పాట‌లు పెట్టేశారా? అంటూ తన ట్వీట్‌లో నిలదీశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments