Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసులో కీలక పరిణామం... ఇక నిందితులు రోజులు లెక్కించుకోవాల్సిందే...

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (18:32 IST)
హైదరాబాద్ నగరంలో పశువైద్యురాలు దిశ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులకు సత్వరం శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇందులోభాగంగా, ఈ కేసు విచారమ నిమిత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటును ఏర్పాటు చేయాల్సిందిగా హైకోర్టులో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు కావడం, దానికి కోర్టు అనుమతించడం చకచకా జరిగిపోయింది. 
 
హైకోర్టు స్పందన నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ దీనిపై కసరత్తు చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టును మహబూబ్ నగర్‌లో ఉర్పాటు చేసేందుకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో, ఈ కేసు విచారణ త్వరితగతిన సాగనుంది. రోజువారీ విచారణ జరిపి, నిందితులకు త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వరంగల్‌లో ఓ బాలిక హత్య ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా... కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై, తీర్పు వెలువడిన విషయం తెల్సిందే. వీరికి శిక్షను అమలు చేయాల్సివుంది. 
 
ఇదిలావుంటే, దిశ హత్య కేసులోని నిందితుల వద్ద విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సమ్మతించింది. దీంతో ఈ నలుగురు నిందితులను పోలీసులు వారం రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు, ఈ నలుగురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరచగా, వారిపై స్థానికులు చెప్పులు విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments