Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల నైతిక స్థైర్యాన్ని పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలి : నాగబాబు

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:42 IST)
పిల్లల నైతిక స్థైర్యాన్ని పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలని నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. 
 
వీటిపై నాగబాబు స్పందిస్తూ, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న కారణంగానే ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యల బాట పడుతున్నారన్నారు. ఫెయిలైనవాడు ఎందుకూ పనికిరాడంటూ ఓ పరమచెత్త పరిస్థితి సృష్టిస్తున్నారని, పిల్లలు ఆ ఒత్తిడికే బలవుతున్నారంటూ మండిపడ్డారు. తమ కుటుంబంలో అలాంటి పరిస్థితి లేదని నాగబాబు గర్వంగా చెప్పారు.
 
'మా నాన్న అది చదవమని. ఇది చదవమని ఏనాడూ ఎవరినీ ఒత్తిడి చేయలేదు. బాగా చదువుతున్నారా? లేదా? అని మాత్రమే మా అమ్మ అడుగుతుండేది. ఫలానా చదువే చదవాలని వాళ్లెప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే అన్నయ్య డిగ్రీ చదివారు. నేను నాకెంతో ఇష్టమైన ఎల్ఎల్‌బీ చదివాను. మా ఇద్దరు చెల్లెళ్లలో ఒకరు ఎంబీబీఎస్ చేయగా మరొకరు డిగ్రీ పూర్తి చేశారు. ఇక, కల్యాణ్ బాబు ఇంటర్ తర్వాత ఐటీ డిగ్రీ చేశాడు' అంటూ చెప్పుకొచ్చాడు. 
 
పైగా, మా ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదన్నారు. 'పదో తరగతిలో మ్యాథ్స్ పరీక్ష సరిగా రాయకపోవడంతో ఫెయిల్ అవుతానని భయం పట్టుకుంది. అదే విషయం మా నాన్నతో చెబితే, పాసైతే రూ.100 ఇస్తాను, ఫెయిలైతే రూ.500 ఇస్తాను అని చెప్పారు. రిజల్ట్ గురించి టెన్షన్ పెట్టుకోకుండా సంతోషంగా ఉండు అని ఆయన తన మాటలతో చెప్పారు' అని చెప్పారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతికపరమైన బోధ చేయాలే తప్ప, ఒత్తిడికి లోను చేసేలా ప్రవర్తించరాదని నాగబాబు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments