Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింక మాంసంతో మద్యం పార్టీ...

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు జింక మాంసం కూరతో మద్యం పార్టీ చేసుకున్నాడు. ఇందుకోసం ఆ కుర్రోడు జింకను వేటాడి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఆ వేటగాడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం భానపూర్ గ్రామానికి చెందని శేఖర్ అనే యువకుడు ఓ జింకను వేటాడాడు. అనంతరం దాన్ని చంపి పార్టీ చేసుకున్నాడు. ఈ ఘటనపై రహస్య సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శేఖర్ ఇంటిపై దాడిచేశారు.
 
ఈ సందర్భంగా జింక తల, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో శేఖర్‌పై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమళ్లు, జింకలు వంటి జీవులను వేటాడటంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మరోవైపు శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments