పవన్‌ను చూసి వణికిపోతున్నారు.. అందుకే వ్యక్తిగత విమర్శలు : నాదెండ్ల

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (15:39 IST)
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను చూసి వైకాపా పాలకులు వణికిపోతున్నారనీ, అందుకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ముగ్గురు భార్యలున్న పవన్ కల్యాణ్ తన నలుగురో.. ఐదుగురో పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు సంయమనం పాటించాలని కోరారు. పవన్‌పై జగన్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై ఎవరూ స్పందించవద్దని... భవన నిర్మాణ కార్మికులపై మన అధినేత చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చేసినట్టు భావిస్తున్నామన్నారు. 
 
ప్రభుత్వ పాలసీల గురించి పవన్ మాట్లాడుతుంటే.... ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని... ఇది బాధాకరమని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ... ప్రజాక్షేమం కోసం మనం భరిద్దామని పవన్ కల్యాణ్ చెప్పారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా సమాధానమిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments