Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

అయ్యా జగన్ గారూ.. నా పెళ్లిళ్ళ వల్లే మీ దొంగల ముఠా జైల్లో చిప్పకూడు తిన్నదా? పవన్

Advertiesment
Pawan Kalyan
, సోమవారం, 11 నవంబరు 2019 (14:45 IST)
తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తన పెళ్లిళ్ళ వల్లే మీరు జైలుకెళ్లి చిప్పకూడు తిన్నారా జగన్ అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు జనసేన శతఘ్ని టీమ్ కౌంటర్ ఇచ్చింది. 
 
తాజాగా పవన్ పెళ్లిళ్లపై జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో 'పవన్ కల్యాణ్‌ని కూడా అడుగుతున్నా.. అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తున్నారో అడుగుతున్నాను' అని జగన్ చేసిన వ్యాఖ్యలను శతఘ్ని వీడియోలో వినిపించింది.
 
దానికిందనే జగన్‌కు పవన్ ఇచ్చిన కౌంటర్‌ను కూడా జతచేసింది. అందులో పవన్... 'జగన్‌ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని అన్నారు.
 
'వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్‌గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్థ జగన్‌లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి‌గా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?' అని శతఘ్ని టీమ్ ప్రశ్నించింది. 'మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కల్యాణ్‌గారి పెళ్లిళ్ల వల్లే అంట నిజమా జగన్?' అని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యా పవన్.. మీ ముగ్గురు భార్యలూ.. నలుగురో.. ఐదుగురో పిల్లలు.... సీఎం జగన్