Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు విస్త‌ర‌ణ‌లో మ‌సీదు వివాదం... జోక్యం చేసుకున్న అవినాష్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (12:02 IST)
విజ‌య‌వాడ‌లోని రోడ్డు విస్త‌ర‌ణ‌లో ఒక మ‌సీదు అడ్డు ఉంద‌ని అధికారులు తొలగించే ప్ర‌య‌త్నం చేయగా, వైసీపీ యువ‌నేత దేవినేష్ అవినాష్ అడ్డుప‌డ్డారు. మ‌త‌పెద్ద‌లు చెప్పిన విన‌తిపై స్పందించి, మైనారిటీ మంత్రి అంజాద్ భాషాతో చ‌ర్చించారు. 
 
 
స్థానిక ఏపీఐఐసీ కాలనీలో రోడ్డు విస్తరణ కారణంగా అక్కడ ఉన్న మసీదు తొలగిస్తున్నారని మత పెద్దలు దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా, దానిపై విఎంసి కమిషనర్ తో అవినాష్ మాట్లాడారు. చివ‌రికి మ‌సీదు తొల‌గిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా మరొక చోట కొత్త మసీదు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చారు. దీనితో దేవినేని అవినాష్, మసీదు కమిటీ సభ్యులతో  కలిసి స్థల పరిశీలన చేశారు. 
 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎవరికి అన్యాయం జరగదు అని  దేవినేని అవినాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, మసీదు కమిటీ అసిఫ్, అభీద్ ఖాన్, గౌస్, చోటు, రిజ్వన్, కలాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments