Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్, రోజాల మధ్య ఆత్మీయ పలుకరింపు.. ఆ హామీ ఇచ్చారట

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:50 IST)
రెండురోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. సిఎం బస చేసిన ప్రాంతంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు కలిశారు. శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సిఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. 

 
అయితే సిఎం ఎంతోమందితో మాట్లాడారు కానీ నగరి ఎమ్మెల్యే రోజాతో ప్రత్యేకంగా మాట్లాడారట. రోజాను ఆత్మీయంగా పలుకరించారట సిఎం. రోజా కూడా నవ్వుతూ సిఎం జగన్మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎలా ఉన్నావమ్మా అంటూ సిఎం అడగంతో బాగున్నాను అన్న అంటూ సమాధానమిచ్చారట రోజా. 

 
అంతేకాదు, త్వరలో నువ్వు అనుకున్నది జరుగుతుందని కూడా సిఎం చెప్పి వెళ్లిపోయారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో రోజాకు బెర్త్ కన్ఫామ్ అన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఎపిఐఐసి పదవి నుంచి రోజాను పక్కనబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే ఇక సిఎం మంత్రి పదవిని రోజాకు ఇస్తారో లేదోనన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు సిఎంను కలిసినా కూడా రోజాకు మాత్రమే సిఎం హామీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడదే పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ కూడా జరుగుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments