డప్పు కొట్టి దరువేసిన ఆర్కే రోజా.. 72మంది డప్పు కళాకారులకు..?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:19 IST)
నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే రోజా డప్పు కొట్టి దరువేశారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు. 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర పరికరాలను ఎమ్మెల్యే రోజా అందచేశారు. 
 
 
కళాకారులతో కలిసి తానే డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు ఎమ్మెల్యే రోజా. వారితో ఆడుతూ పాడుతూ ఉత్సాహ పరిచారు. నగరిలో ఎమ్మెల్యే ఆర్.కె. రోజా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 
 
ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌లో పాల్గొన్నారు. పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయ‌కులు, ప్రజ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

ఏ బిడ్డకైనా తండ్రే హీరో అంటున్న శరవణన్ నటించిన లీడర్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments