Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం... నష్టపరిహారం ఖాతాల్లో జమ చేస్తాం...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:03 IST)
అకాల వర్షాల కారణంగా నీట మునిగిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామ‌ని, ఈక్రాప్ బుకింగ్, ఈకేవైసీ చేయించుకున్న ప్రతిరైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హామీ ఇచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దఎత్తున పంట పొలాలు నీట మునిగాయని, ఈనాటికి కొన్నిచోట్ల పొలాల్లో మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


నియోజకవర్గ రైతాంగ పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో మాట్లాడతాన‌ని, త్వరలో నష్టపరిహార నగదు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. రైతు ఎక్కడా నష్టం చవిచూడకుండా చూసే బాధ్యత తమదని, రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం  తమ ప్రభుత్వమన్నారు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.
 

తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్నపంట పొలాలను రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పరిశీలించారు. పెదకాకాని మండల పరిధిలోని నంబూరు, వెంకటకృష్ణాపురం, అనమర్లపూడి, తంగెళ్ళమూడి, తక్కెళ్ళపాడు గ్రామాలలో పంట పొలాలను ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments