Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు: ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని.

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (09:55 IST)
టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని... బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆది నారాయణ రెడ్డి దళితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. వారు అభివృద్ధి చెందక పోవడానికి వారే కారణమంటూ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కామెంట్లు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రి అభివృద్ధి అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్‌ దళితులకు పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
 
దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణమని.. వారి భూములకు పట్టాలుండవు. వారు బాగు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారని దళితులను కించపరిచారు. ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments