Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ వెబ్ సైట్లపై సైబర్ అటాక్.. ఇండియన్ హ్యాకర్ల పనేనట...

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (09:45 IST)
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాకిస్థాన్‌కు చెందిన 500 వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. అందులో పాకిస్థాన్ సర్కారుకు చెందిన పలు ప్రధాన వెబ్ సైట్లు కూడా వున్నాయి. అంతేగాకుండా హ్యాక్ చేసిన వెబ్ సైట్లలో భారత్‌ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. కొన్ని వెబ్ సైట్లను వేగంగా పునరుధ్ధరించినప్పటికీ.. పునరుద్ధరణ జరగని సైట్లలో వెబ్ సైట్ అండర్ మెయింటెనెన్స్‌... విల్ బి బ్యాక్ సూన్... సారీ ఫర్ ది ఇన్ కన్వీనియెన్స్.. అంటూ సందేశాలు కనిపిస్తున్నాయి. 
 
లూలూసెక్ ఇండియా అని పిలువబడే హ్యాకర్ల బృందం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి చుక్కలు చూపించినట్లు పాకిస్థాన్ ఐటీ శాఖాధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మధ్య కాలంలో భారత వైబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నించడం...ఆ వెంటనే భారత హ్యాకర్లు ప్రతీకార చర్యలకు దిగడం వెంటవెంటనే జరిగిపోతున్నాయి. 
 
పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ, జలవనరులు-విద్యుత్ శాఖ, వంటి పలు మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ సైట్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments