Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణాల చెల్లింపులపై మారటోరియం.. సుప్రీం కోర్టులో పిటిషన్‌

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (22:50 IST)
కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై స్పష్టత కోరుతూ సుప్రీం ధర్మాసనం కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం, ఆర్‌బీఐకి సూచించింది.

ఈ ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ది సంస్థ (క్రిడాయ్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

క్రిడాయ్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే ఆర్‌బీఐ ప్రకటన బ్యాంకులన్నింటికీ వర్తించేదిలా ఉండగా.. కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదని తెలిపారు.

కేంద్రం తరఫున దీనికి సమాధానమిచ్చిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తామని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments