Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కోసం 800 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (07:57 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఒక అభిమాని ఏకంగా 800 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి వచ్చారు. జగన్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్న మహారాష్ట్ర రైతు షోలాపూర్ జిల్లా నుంచి సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. ఆయనను సీఎం జగన్ ఆప్యాయంగా స్వాగతించి ఫోటోలు దిగారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా వాసి. సీఎం జగన్ అంటే అమితమైన అభిమానం. ఆయన విధానాలు లక్ష్మణ్ కాక్డేకు ఎంతగానో నచ్చాయి. దాంతో సీఎం జగన్‌ను ఎలాగైనా కలవాలని పట్టుదలతో ఈ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. 
 
ఇందుకోసం ఈ నెల 17వ తేదీన మహారాష్ట్రలలోని తన స్వగ్రామం నుంచి బయలుదేరి ఆయన.. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లికి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. కాక్డే గురించి విషయం తెలుసుకున్న సీఎం జగన్... ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించాడు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టును ధరించివచ్చారు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అని రాసివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments