Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలో మొదలైన రాజీనామాల పర్వం...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:39 IST)
జనసేన.. హఠాత్తుగా... ఏదో నిరసనల మధ్య మొదలై నిన్న మొన్నటి వరకు ఏవో సంచలనాలతో... పార్టీలో చేరాలంటే ఇంటర్వ్యూలనీ.. అవనీ ఇవనీ వినూత్న పద్దతిలో ముందుకు సాగిపోతూండిన పార్టీ అయితే అందులో కూడా ఇతర పార్టీలలో టిక్కెట్‌లు రాని వారు వచ్చి చేరడం వారికే టిక్కెట్లు ఇవ్వడంతో అసంతృప్తితో రాజీనామాల పర్వం మొదలైంది.
 
జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాని ప్రకటించిన కొద్ది సేపటికే... అసంతృప్తికి గురైన వారు రాజీనామాల పర్వం మొదలెట్టేసారు. పశ్చిమగోదావరి జిల్లా కో కన్వీనర్ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో.. పార్టీ నిర్ణయంపై అసంతృప్తి చెందడమే ఆయన రాజీనామాకి కారణంగా తెలుస్తోంది. పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరితో వారికి టిక్కెట్లు ఇవ్వడం సరైనది కాదని ఈ సందర్భంగా యర్రా నవీన్‌ వ్యాఖ్యానించారు.
 
కాగా ఇవాళ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ రాజమండ్రిలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సభ నుండి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూండగా... ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఈ సందర్భంగా పవన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
 
మరి ఈ రాజీనామాల పర్వానికి ముగింపుగా బుజ్జగింపులు, ఓదార్పులు పవన్ వినూత్నంగా ఎలా చేపడ్తాడో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments