Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ మీదపడి చిన్నారి మృతి... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:00 IST)
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలో ప్రాణాలు తీస్తుంటాయి. అదీకూడా అత్యంత సురక్షితంగా ఉండే మన ఇళ్ళలోనే ఇలాంటి విషాదకర సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇంట్లో టేబుల్‌పై ఉన్న టీవీ మీదపడి 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం పాత కంచల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన చలమల నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కీర్తి (11 నెలలు) శనివారం ఇంట్లో టీవీ ముందు కూర్చుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి బయట ఉన్నారు. 
 
చిన్నారి టీవీ పక్కనే ఉన్న కేబుల్‌ తీగ లాగడంతో టీవీ ఆమెపై పడింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు పాపను ఐతవరం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. త్వరలో తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో పాప అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments