Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ మీదపడి చిన్నారి మృతి... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:00 IST)
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలో ప్రాణాలు తీస్తుంటాయి. అదీకూడా అత్యంత సురక్షితంగా ఉండే మన ఇళ్ళలోనే ఇలాంటి విషాదకర సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇంట్లో టేబుల్‌పై ఉన్న టీవీ మీదపడి 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం పాత కంచల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన చలమల నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కీర్తి (11 నెలలు) శనివారం ఇంట్లో టీవీ ముందు కూర్చుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి బయట ఉన్నారు. 
 
చిన్నారి టీవీ పక్కనే ఉన్న కేబుల్‌ తీగ లాగడంతో టీవీ ఆమెపై పడింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు పాపను ఐతవరం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. త్వరలో తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో పాప అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments