Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు చికెన్ పకోడి తినలేదనీ ప్రియుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (14:27 IST)
తాను ఎంతో ఇష్టంగా తెచ్చిన ప్రియురాలు చికెన్ పకోడి తినక పోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుడివాడ, ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను (25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను, ఆమె ఈనెల 19న మచిలీపట్నం వెళ్లివచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడిపకోడి తెచ్చుకున్నాడు. 
 
ఆ రోజు రాత్రిపూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments