Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 4 రోజులు కనిపిస్తే.. హైదరాబాద్‌లో 40 రోజులు ఉంటాడు : కేశినేని

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజులు కనిపిస్తే హైదరాబాద్‌లో మాత్ర

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (15:05 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజులు కనిపిస్తే హైదరాబాద్‌లో మాత్రం 40 రోజులు ఉంటాడంటూ సెటైర్లు వేశారు.
 
ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిజంగా సీరియస్ రాజకీయ నాయకుడు కాదనీ, ఆయన మాటలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు అసలు రైతుల సమస్యల గురించి ఎంతమాత్రం అవగాహన లేదన్నారు. 
 
రైతుల కోసం పోరాడుతున్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని పవన్‌కు హితవు పలికారు. చంద్రబాబుపై కాకుండా ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన ప్రధాని మోడీపై పోరాడాలని పవన్‌కు నాని సూచించారు.
 
చంద్రబాబును లక్ష్యంగా బీజేపీ పన్నిన కుట్రలో కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు భాగస్వాములయ్యారని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని తొలుత చెప్పిన కేంద్రం ఇప్పుడు జోన్ అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణమన్నారు. 
 
'నాగ్‌పూర్ జనాభా కంటే విజయవాడ జనాభా ఎక్కువ.. అక్కడ మెట్రో మంజూరుకు లేని ఇబ్బంది.. ఇక్కడ ఎందుకు వచ్చింది?' అంటూ కేశినేని నాని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవక్కర్లేదన్న నాని.. ఆయనసలు పొలిటీషియనే కాదని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments