Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై : టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి

చెన్నైలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి జరిగింది. ఆయన ఇంటిముందు నిలిపివున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో డ్రైవర

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (14:58 IST)
చెన్నైలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి జరిగింది. ఆయన ఇంటిముందు నిలిపివున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
 
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన చెన్నై, ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 
 
అప్పటి నుంచి ప్రభుత్వ పనితీరును దినకరన్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కారుపై బాంబు దాడి జరగగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యతిరేక వర్గీయులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments