Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కలిపిన "కమలసేన" - అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే నాలుగున్నరేళ్లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని రకాల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో సమావేశమైన బీజేపీ - జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామనీ, రెండు పార్టీల్లో అవగాహనాలోపం రాకుండా అన్నీ చర్చించామనీ, బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంకా పవన్ చెపుతూ... 'బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. మోడీ, అమిత్‌ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామ'ని పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments