Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కలిపిన "కమలసేన" - అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే నాలుగున్నరేళ్లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని రకాల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో సమావేశమైన బీజేపీ - జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామనీ, రెండు పార్టీల్లో అవగాహనాలోపం రాకుండా అన్నీ చర్చించామనీ, బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంకా పవన్ చెపుతూ... 'బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. మోడీ, అమిత్‌ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామ'ని పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments