Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కలిపిన "కమలసేన" - అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే నాలుగున్నరేళ్లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని రకాల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో సమావేశమైన బీజేపీ - జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామనీ, రెండు పార్టీల్లో అవగాహనాలోపం రాకుండా అన్నీ చర్చించామనీ, బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంకా పవన్ చెపుతూ... 'బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. మోడీ, అమిత్‌ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామ'ని పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments