Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక సరఫరాకు జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలి: జగన్​

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:52 IST)
రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, గనుల శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో కొనసాగుతున్న వరద పరిస్థితుల కారణంగా తవ్వకాలకు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

97 రీచ్​ల ద్వారా పరిమితంగా జరుపుతున్న తవ్వకాలతో రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేయగలుగుతున్నట్టు వివరించారు. తక్షణం ఇసుక కొరతను తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

రిజర్వాయర్లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వి... సరఫరా చేయాలని సూచించారు. ప్రైవేటు పట్టా భూముల్లోనూ తవ్వకాలను పెంచాల్సిందిగా సూచించారు.

ఇసుక సరఫరా కోసం అనుసరిస్తున్న విధానంలోనూ స్వల్ప మార్పులు చేయటంతో పాటు.. జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సామాన్యులకు ఇసుక లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments