జగన్‌ను నడిపించేవాడు కావాలి.. నన్నడిగితే ఆలోచిస్తా: 100 రోజులపై జేసీ పొగడ్తలు

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (14:32 IST)
యువ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల కాలంలో సీఎం జగన్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయనుకోండి. ఇక కొన్ని మీడియా సంస్థలైతే జగన్ 100 రోజుల పాలనపై సర్వేలు మొదలుపెట్టాయి. ఆ సర్వేల్లో ఏమేం చెపుతారన్నది పక్కన పెడితే తెదేపా సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. 
 
జగన్ 100 రోజుల పాలన భేషుగ్గా వుందని అన్నారు. 100 రోజులకు 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడే అని అన్నారు. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. మావాడు చాలా తెలివైనవాడనీ, ఐతే జగన్ మోహన్ రెడ్డిని నడిపించే మంచి నాయకుడు ఒకడు కావాలని అభిప్రాయపడ్డారు. తనను జగన్ అడిగితే ఆలోచిస్తానని అన్నారు. 
 
రాజధాని అమరావతిలోనే వుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జగన్ నేలకేసి కొట్టకుండా మైక్రోస్కోపులో చూడాలని సూచన చేశారు. జగన్ యువకుడు కాబట్టి కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకుంటూ వుంటాడనీ, కాస్త ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటుందన్నారు. ఏదేమైనప్పటికీ ఏపీకి మంచి జరగాలనీ, జగన్ మోహన్ రెడ్డికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments