Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం: జనసేన

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:12 IST)
పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే  చూస్తూ ఊరుకోబోమని జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ వైసీపీని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్‌పై పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని.. ముందస్తు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ మాట్లాడుతూ... నిరసన తెలియ చేసే హక్కు తమకుందన్నారు. అయినా పోలీసులు ముందుగానే ఎలా అరెస్టు చేస్తారని అజయ్ ప్రశ్నించారు.

జోగి అవినీతి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతల్లా తాము ఓట్లు కొనుక్కుని గెలవలేదన్నారు. మీ నాయకుడు లాగా అవినీతి చేసి జైలుకు వెళ్లలేదన్నారు.

మీలాగా సంస్కారం మరచి మాట్లాడటం తమ నాయకుడు నేర్పలేదన్నారు. అధికార మదంతో ‌వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అజయ్ వర్మ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments