Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మాజీ నేతలు స్వలాభం మానుకోవాలి : నాగబాబు హితవు (Video)

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (09:18 IST)
వైకాపాతో సహా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఓ సూచనతో కూడిన హెచ్చరిక చేశారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత స్వలాభం గురించి ఆలోచన చేయడం మరిచిపోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలో చేరడం అంటే అవసరంలో ఉన్న వారికి శాయశక్తులు సేవ చేయడమన్నారు. 
 
అంతేకానీ, ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి గత వైకాపా ప్రభుత్వంలో నడుచుకున్నట్టుగా దోచుకుందాం, దాచుకుందాం అంటే కుదరదని చెప్పారు. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినా ముఖ్యంగా, వైకాపా నుంచి వచ్చిన వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది స్వలాభం అనే ఆలోచన ఉండకూడదు అని, ఏదన్నా నిజంగా అవసరం, సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరపున సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపారు. 
 
కాగా, సోమవారం చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన అనేక మంది వైకాపా నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేన పార్టీలో చేరారు. వీరిని ఉద్దేశించి నాగబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వివిధ ప్రమాదాల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తరపున పార్టీ తరపున ఆర్థిక సాయం చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments