Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మాజీ నేతలు స్వలాభం మానుకోవాలి : నాగబాబు హితవు (Video)

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (09:18 IST)
వైకాపాతో సహా ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఓ సూచనతో కూడిన హెచ్చరిక చేశారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత స్వలాభం గురించి ఆలోచన చేయడం మరిచిపోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలో చేరడం అంటే అవసరంలో ఉన్న వారికి శాయశక్తులు సేవ చేయడమన్నారు. 
 
అంతేకానీ, ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి గత వైకాపా ప్రభుత్వంలో నడుచుకున్నట్టుగా దోచుకుందాం, దాచుకుందాం అంటే కుదరదని చెప్పారు. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినా ముఖ్యంగా, వైకాపా నుంచి వచ్చిన వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది స్వలాభం అనే ఆలోచన ఉండకూడదు అని, ఏదన్నా నిజంగా అవసరం, సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం తరపున సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపారు. 
 
కాగా, సోమవారం చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన అనేక మంది వైకాపా నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జనసేన పార్టీలో చేరారు. వీరిని ఉద్దేశించి నాగబాబు పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వివిధ ప్రమాదాల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తరపున పార్టీ తరపున ఆర్థిక సాయం చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments