Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ దేవాలయాలంటే జగన్ కు నచ్చదు: మాజీ మంత్రి జవహర్

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:55 IST)
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా దాడులు దళితుల మీద, దేవుళ్లలో హిందూ దేవాలయాలపై దాడుల జరుగుతున్నాయని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ విమర్శించారు. జగన్ కు మనుషుల్లో నచ్చని వాళ్లు దళితులు, దేవుళ్లలో నచ్చని దేవుళ్లు హిందూ దేవుళ్లని అన్నారు.

సాక్ష్యాత్తు సోనియా గాంధీ కూడా మత విశ్వాసాలను గౌరవిస్తానని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా  డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దేవాలయంలోకి ప్రవేశించారని అన్నారు. 

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితిలేదని అంటున్నారని, రాబోయే రోజుల్లో సంప్రోక్షణ, బ్రహ్మోత్సవాలు, దర్శనాలు, దేవుడికి ఏదీ లేకుండా చేసే పరిస్థతి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందని పేర్కొన్నారు.

భారతదేశం లౌకిక రాజ్యం అని, ఇందులో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలు గౌరవించాలని, కానీ వాటిని  జగన్ అన్నీ పక్కన బెట్టారని మండిపడ్డారు. కేవలం స్వరూపానంద కాళ్లు నొక్కితే జగన్ కు స్వర్గం వస్తుందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గంగలో మునిగితే హిందూభావం వస్తుందనుకుంటే పొరపాటేనని, ప్రజల మనోభావాలు గౌరవించలేని ముఖ్యమంత్రి రాజీనామా చేసి  ప్రశాంతంగా జైల్లో కూర్చుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.  కనకదుర్గమ్మ గుళ్లో వెండి సింహాలు మాయం, అంతర్వేదిలో రధం దగ్ధం కావడం జగన్ రెడ్డి అలసత్వానికి నిదర్శనమని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments